సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలు 2012, ఫిబ్రవరి 2,3,4 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సిపిఎం మహా సభలకు రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్కరత్, పొలిట్బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బృందాకరత్ హాజరవుతారని వెల్లడించారు. మొత్తం 700 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై, రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తామన్నారు. మహాసభల ముగింపు రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment