Sunday, July 31, 2011

నయాఉదారవాద విధానాలకు స్వస్తి పలకాలి

నయా ఉదారవాద ఛీర్‌ లీడర్స్‌ పట్టుదల విస్తుగొలుపుతోంది. వారు తమ స్వీయ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. నాటి ఆర్థిక మంత్రి డాక్టర్‌ మన్హో హన్‌ సింగ్‌ తన తొలి బడ్జెట్‌ సమర్పించి ( 1991 జులై 24) ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరిన్ని సంస్కరణలు ముఖ్యంగా ద్రవ్య సరళీకరణను మరింతగా తీసుకురావాలని అదే పనిగా రొదపెడుతున్నారు. యుపిఏ-1 ప్రభుత్వం పెన్షన్‌ నిధుల ప్రయివేటీకరణ, బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి పెంపు, విదేశీ బ్యాంకులను మరింత పాత్ర కల్పించేందుకుద్దేశించిన బ్యాంకింగ్‌ సంస్కరణలు, రూపాయికి పూర్తి మారకపు విలువ కల్పించడం వంటి సంస్కరణలను వామపక్షాలు ఆనాడు అడ్డుకోబట్టి సరిపోయింది. లేకుంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం, మాంద్యం దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఉండేది. వారు ఈ విషయాన్ని మరచిపోయినట్లు నటించడమో లేక ఉద్దేశపూర్వకంగానే విస్మరించడమో చేస్తున్నారు.
అత్యంత అట్టహాసంగా సాగిన ఆ బడ్జెట్‌ ప్రసంగం విషయానికి తిరిగొస్తే నయా ఉదారవాద విధానాల వ్యవస్థకు అదొక్కటే భావి సూచిక కాదనే విషయం గుర్తించాలి. ఆ బడ్జెట్‌ సందర్భంగానే రెండు సార్లు భారత రూపాయి విలువ పడిపోయింది. సంస్కరణల ముసుగుతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లాలని రాజీవ్‌ గాంధీ ఇచ్చిన పిలుపు దిగుమతులు భారీ స్థాయిలో పెరిగి విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభానికి దారితీసింది. 1985 నుండి 1989 వరకు 350కి పైగా భారత కార్పొరేట్‌ కంపెనీలకు రు. 5,781 కోట్ల మేరకు విదేశీ మారక ద్రవ్య నష్టం సంభవించింది. దిగుమతులు భారీ స్థాయిలో పెరగడంతో భారత దేశ విదేశీ రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. 1984 -1991 మధ్య భారతదేశ విదేశీ రుణం రు. 28,000 కోట్ల నుండి రు. 1,00,425 కోట్లకు అమాంతంగా పెరిగిపోయింది.
రెండు దశాబ్దాల తరువాత ఆ ఉల్లాసం ఆవిరైపోయి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. రెండు భారతాలను సృష్టించడంలో మనం ఆరితేరాము. ప్రతి ఒక్కరి జీవన శైలి కొంతమేర మెరుగుపడినా, విపరీతంగా పెరిగిపోయిన ఆదాయ అసమానతలు దుర్భర పేదరికానికి కాకపోయినా పేదరికానికి సూచికగా చూడొచ్చు. ఈ విధానాల వల్ల తలెత్తిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం, రైతాంగ ఆత్మహత్యలు , ఆహార ధాన్యాల, పప్పుల తలసరి అందుబాటు గణనీయంగా పడిపోవడం వంటివి మన ప్రజల్లో కొన్ని తరగతుల్లో పెరిగిపోతున్న దారిద్య్రాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఉజ్వల భారతం వెలుగుజిలుగులు ఈ నలిగిపోతున్న భారతాన్ని మరింత దిగజార్చిన ఫలితమే.
ఈ ఉదారవాద పండితులు నయా ఉదారవాద విధానాల అంతర్జాతీయ ఏజెంట్‌ అయిన ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) 2010లో భారత దేశంలో ఒక అధ్యయనం నిర్వహించిందనే విషయాన్ని గుర్తించాలి.' ఇండియా ఈజ్‌ది రైజింగ్‌ టైడ్‌ లిఫ్టింగ్‌ ఆల్‌ బోట్స్‌ ' అన్న శీర్షికతో ప్రచురించిన పత్రం ప్రపంచం అంతటా గుర్తిస్తున్న ఆదాయ అసమానతల సూచి ( దీనినే జినీ కోఎఫిషియంట్‌ అంటున్నారు) ప్రాతిపదికగా భారత దేశంలో పరిస్థితిని విశ్లేషించింది. 21 శతాబ్దం తొలి దశకంలో ఇది దేశం మొత్తం మీద 0.303 నుండి 0.335కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఈ జినీ కోఎఫిషియంట్‌ 0.343 నుండి 0.378కు పెరిగిందని ఆ పత్రం పేర్కొంది. రెండు భారతాల మధ్య పెరుగుతున్న అంతరాలకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి.
డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను అదే పనిగా పొగుడుతున్నవారు ఆయనను ఆర్థిక మంత్రిగా మొదటి స్థానంలో నియమించిన పిపి నరసింహారావును కొంచెం కూడా తలచుకోవడం లేదు. వాస్తవానికి పివి నరసింహారావు తన ప్రభుత్వ చివరి సంవత్సరంలో సంస్కరణల ప్రక్రియ ప్రజలకు ఆహారం, పని, ఆశ్రయం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక హక్కులను తప్పక కల్పిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదని నిక్కచ్చిగా అంగీకరించారు. 1975 మార్చిలో కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారు. '' నేడు ప్రపంచం చారిత్రిక మలుపులో ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితి నుండి బయటపడేందుకు తంటాలుపడుతున్నది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సఫలం కాలేదు. నేడు లోలకం మరోవైపు తిరుగుతోంది. ఎదురులేని మార్కెట్‌ వ్యవస్థ మాత్రమే కేంద్ర బిందువవుతోంది. మార్కెట్‌ ఆధారిత వ్యవస్థ మాత్రమే అత్యంత ముఖ్యమన్న భావన నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. లేనిపక్షంలో పేదలు, బలహీనవర్గాలు మార్కెట్‌లో నెలకొనే పరిస్థితుల కారణంగా ఒక మూలకు నెట్టివేయబడే అవకాశం ఉంది. ప్రజలను కేంద్ర బిందువులను చేయడంలో వైఫల్యం వల్లే ఈ రెండు వైఖరులు ఆచరణలో విఫలమయ్యాయి. ప్రజలను కేంద్ర బిందువులను చెయ్యడం చాలా ముఖ్యం. నిలకడతో కూడిన మానవ పురోగతిని సాధించేందుకు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రజల సాధికారిత కేంద్రంగా కలిగిన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరమెంతైనా ఉంది''.
భారత దేశం గురించి ప్రస్తావిస్తూ నాటి ప్రధాని ఇంకా ఈ విధంగా అన్నారు. '' తగిన వనరులు, వివక్షతకు తావులేని మార్కెట్లు, టెక్నాలజీల అందుబాటు లేకుండా పేదరిక నిర్మూలన, సామాజిక సమగ్రత వంటి కీలక సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. పేద ప్రజలకు హక్కులు కల్పించేందుకు వ్యవస్థ నిర్మాణం, విధానాలు, వ్యూహాల రూపకల్పన, అన్నిటినీ మించి వివిధ పథకాలు, కార్యక్రమాలు ఫలవంతమయ్యేందుకు దోహదం చేసే పర్యవేక్షణ, విశ్లేషణ వంటి పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటుకు అవసరమైన వనరులను సమకూర్చాలి. జాతీయ స్థాయిలో ఇది జరగాలి. నేను పేర్కొన్న హక్కులు విశాల దృక్పథంతో కూడిన అభివృద్ధికి సంబంధించిన మౌలిక హక్కులు మాత్రమే. మార్కెట్‌, రాజ్యంలో చోటుచేసుకునే వికృత పరిణామాలను చక్కదిద్దేందుకు ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు, విజయాలు సాధించేందుకు దోహడం చేస్తాయి. పేదరికాన్ని పారద్రోలాలనే మన లక్ష్యాన్ని సాధించేందుకు మన దేశంలో ప్రస్తుతం అమలుచేస్తున్న సంస్కరణల నేపథ్యంలో ఇటువంటి సమన్వయాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది''.
ప్రజల ఆర్థిక, సామాజిక సాధికారికత ఈ నయా ఉదారవాద వ్యవస్థలో సాధ్యమేనా? ఇటువంటి విధానాల నుండి వైదొలగడం ద్వారా మాత్రమే ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్థి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మొత్తం మీద దీనిని అంగీకరించేందుకు పివి నరసింహారావు నిరాకరించారు. 1996 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఆయన ఈ అంశాలను ప్రస్తావించారన్న విషయం సుస్పష్టం.
ఈ లక్ష్యాలను సాధించాలంటే మన ప్రజలకు ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య కల్పించే నూతన తరహా సంస్కరణలు కావాలి. అంతకంతకూ ప్రబలుతున్న వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడేందుకు కూడా ఇవి అవసరం. అలాగే దేశవ్యాపితంగా భూసేకరణ సందర్భంగా ఉత్పతన్నమైన సమస్యల నుండి ప్రజలను రక్షించాల్సి ఉంది. నయా ఉదారవాద విధానాల అమలు వల్ల సంభవించిన ముఖ్యమైన పరిణామాల్లో ఒకటేమిటంటే పెట్టుబడి పెద్దయెత్తున పోగుపడేందుకు కావాల్సినన్ని నూతన అవకాశాలు ఏర్పడ్డాయి. అటువంటి వాటిలో భూ సేకరణ ఒకటి. రైతుల నుంచి అతి తక్కువ ధరకు భూములను లాక్కొని సూపర్‌ లాభాలు గడిస్తున్నారు. ఈ విధంగా ఆస్తి పోగుపడడాన్ని గురించి అమెరికన్‌ మేధావి ఒకరు నిర్వచిస్తూ పెట్టుబడిదారీ అభివృద్ధి చరిత్రలో ఇది కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. ఆ పారిశ్రామిక విప్లవం వల్ల యూరప్‌లో వీధిన పడ్డ వారిలో అయిదు కోట్ల మంది ఐరోపాను వీడి ''స్వేచ్ఛా ప్రపంచం'' (అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు) తరలివెళ్లారు. ఈ రోజు భూములు కోల్పోయి వీధిన పడ్డనిర్వాసితులకు అటువంటి అవకాశాలు లేవు.వీరి పరిస్థితి కడు దుర్భంగా ఉంటుంది. అందుకే కాలం చెల్లిన 1894 నాటి భూ సేకరణ చట్టం స్థానే కొత్త చట్టాన్ని తేవాలని వామపక్షాలు కోరుతున్నాయి. భూములు కోల్పోయినవారికి తగిన పరిహారం చెల్లించడంతోబాటు, భావి ఉపాధి, భూ సేకరణ తరువాత పెరిగిన ఆ భూముల విలువలో మాజీ యజమానికి కూడా తగు వాటా కల్పించడం వంటివి ఈ నూతన చట్టంలో పొందుపరచాలి. ల్యాండ్‌, రియల్‌ ఎస్టేట్‌ మాఫియాలు ఎంతో కొంత నామమాత్రపు ధర చెల్లించి రైతులను బలవంతంగా భూముల నుంచి వెళ్లగొట్టే స్థితి రాకుండా ఈ చట్టం రైతులకు అన్ని విధాలా రక్షణ కల్పించాలి.
ఈ విషయంలో వెనక్కి లాగుతున్న ప్రభుత్వం సమగ్ర ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం అమలుకు తగినన్ని నిధులు లేవని బీద అరుపులు అరుస్తోంది. ఈ అరుపులు అసంబద్ధమైనవే కాదు, మెగా స్కాములకు మూల హేతువైన నయా ఉదారవాద విధానాల దుష్ఫరిణామాలను వక్రీకరించడమే. మన దేశంలో వనరులకు లోటు లేదు. అవినీతిపరులైన రాజకీయనాయకులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ మీడియా కుమ్మక్కయి ఈ వనరులను యథేచ్ఛగా లూటీ చేస్తుంటే వాటిని ఎదుర్కోవాలనే రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే అసలు లోపం.
ఈ సంస్కరణలపై కేంద్రీకరించే బదులు మన ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. కానీ, నేడు మలి విడత సంస్కరణల గురించి మాట్లాడడం ప్రభుత్వానికి ఒక ఫ్యాషనైపోయింది. రిటైల్‌ వ్యాపారంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం గురించి మాట్లాడుతున్నది. ఇదే జరిగితే దేశ వ్యాపితంగా ఈ వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది భారతీయ చిల్లర వర్తకులు వీధిన పడతారు. మనం ప్రస్తావిస్తున్న ఈ సంస్కరణలు సామాజిక, ఆర్థిక సాధికారత సాధించే మాట అలా వుంచి మరింత వినాశనానికే దారితీస్తాయి.
ఈ నయాఉదారవాద విధానాలనుంచి ప్రస్తుత యుపిఏ-2 ప్రభుత్వం పూర్తిగా వైదొలిగేందుకు ప్రజా ఒత్తిడిని పెద్దయెత్తున పెంచాల్సిన అవసరం ఉంది. అసమానతలను పెంచుతూ దేశ వనరులు లూటీకి ఊతమిచ్చే ఈ నయా ఉదారవాద విధానాలే ప్రజలు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను సంతరించుకోవడానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వీటిపై పోరాటాల్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయం

అమెరికా మెప్పు కోసం ఇరాన్‌ చమురును కాలదన్నిన భారత్‌

వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశం అయిన అణు ఒప్పందపు ఉక్కు సంకెళ్లకు బందీ అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యురేనియం శుద్ధి, అణు ఇంధనం రీప్రాసెసింగ్‌ సామర్థ్యం సంతరించుకోవడానికి దోహదం చేసే అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినందుకు ఇరాన్‌ను ఒంటరి చేయడంలో, ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
''అణ్వాయుధాలతోసహా పెద్ద ఎత్తున విధ్వంసానికి దారితీసే ఆయుధాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు చేస్తున్న యత్నాల నుండి ఇరాన్‌ను అడ్డుకునేందుకు, ఆ దేశాన్ని ఒంటరిపాటు చేసేందుకు, అవసరమైతే ఆంక్షలు విధించేందుకు అమెరికా, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్‌ సంపూర్ణంగా , చురుగ్గా సహకరిస్తుందా?లేదా? ఇందుకు సంబంధించి అది నిర్దిష్టంగా చేపట్టిన చర్యలేమిటి అన్నదానిని బట్టి భారత్‌పై ఒక అంచనాకు రావడం జరుగుతుంది''. - (2006 హైడ్‌ ఒప్పందంలోని 104 జి (2), ఇ (1)ను పాటించడంపై వార్షిక సర్టిఫికెట్‌ను అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్‌కు సమర్పించే నివేదిక)
భారత్‌ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో 12 శాతం మొత్తాన్ని ఇరాన్‌ సమకూరుస్తోంది. ఇరాన్‌ నుండి రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది. గత కొద్ది మాసాలుగా భారత్‌ ఎటువంటి చెల్లింపులు చెయ్యకపోవడంతో చమురు సరఫరా ఆగస్ట్‌ నెలలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్‌ చమురు కంపెనీలకు భారత్‌ ఐదు వందల కోట్ల డాలర్లు బకాయిపడింది. చెల్లింపులు చేసేందుకు ఏర్పాట్లు చెయ్యకపోతే చమురు సరఫరాలను అనివార్యంగా నిలిపివేయాల్సి వస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితి ఎందుకేర్పడింది? ఇరాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా తెచ్చిన ఒత్తిడికి భారత్‌ దాసోహమంది. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ పరిశ్రమలను అస్తవ్యస్తం చేసే ఉద్దేశంతో ఇరాన్‌పై అమెరికా 2010 ఆగస్ట్‌లో పలు ఆంక్షలు విధించింది. 1929 తీర్మానం ద్వారా ఇరాన్‌పై భద్రతా మండలి విధించిన ఆంక్షలు 2010 జూన్‌ నాటికి ముగిశాయి. ఇరాన్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో బ్యాంకింగ్‌, విదేశీ మారక లావాదేవీలను నిషేధిస్తూ అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించాయి.
అమెరికా ఒత్తిడికి లొంగడం
భద్రతా మండలి విధించిన ఆంక్షలను మాత్రమే కాకుండా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలను కూడా భారత్‌ పాటిస్తోంది. ఈ ఆంక్షల ఒత్తిడి కారణంగా ఆసియన్‌ క్లియరింగ్‌ యూనియన్‌ (ఎసియు) ద్వారా ఇరాన్‌కు వర్తక సంబంధ చెల్లింపులన్నిటినీ రిజర్వు బ్యాంక్‌ నిలిపివేసింది. ఇరాన్‌కు భారత్‌ దీర్ఘకాలంగా ఈ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరుపుతోంది. ఎసియును నిలిపివేయడంతో చెల్లింపులు ఎలా చెయ్యాలనే సమస్య తలెత్తింది. జర్మన్‌ కేంద్ర బ్యాంక్‌ అయిన బుండెస్‌బ్యాంక్‌ ద్వారా ముడి చమురు దిగుమతులకు చెల్లింపులు జరిపేందుకు భారత్‌, ఇరాన్‌ ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. హాంబర్గ్‌లోని యూరప్‌ ఇరాన్‌ వర్తక బ్యాంక్‌ (ఇఐహెచ్‌)కు బుండెస్‌ బ్యాంక్‌ నగదును బదిలీ చేస్తుంది. ఈ బ్యాంక్‌కు ఎటువంటి ఆంక్షలు వర్తించవు. అయితే కొన్ని వారాల తరువాత అమెరికా, ఇజ్రాయిల్‌ ఒత్తిడిపై జర్మనీ ప్రభుత్వం ఈ లావాదేవీలను నిలిపివేసింది. ఇరాన్‌ చమురు సరఫరాలను కొనసాగించినప్పటికీ భారత్‌ ఎటువంటి చెల్లింపులు చెయ్యలేదు.
భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న రెండవ అతి పెద్ద దేశం ఇరాన్‌. కాగా, సౌదీ అరేబియా అగ్ర స్థానంలో ఉంది. ఇరాన్‌తో చమురు వర్తకం కొనసాగించే విషయంపై కాకుండా ప్రత్యామ్నాయ వనరుల కోసం అన్వేషించే కృషిలో యుపిఏ ప్రభుత్వం ఉంది. ఇరాన్‌ నుండి కాకుండా సౌదీ అరేబియా నుండి చమురును దిగుమతి చేసుకోవాలని భారత్‌కు అమెరికా సూచిస్తోంది.
భారత్‌-అమెరికా మధ్య అణు ఒప్పందం కుదిరినప్పటి నుండి ఇరాన్‌తో భారత్‌ సంప్రదాయసిద్ధమైన సంబంధాలు దెబ్బతినడం ప్రారంభించాయి. భారత్‌ విదేశాంగ విధానం తమ దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉండాలన్న విషయాన్ని అణు ఒప్పందం నిర్ధారించిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌పై ఆంక్షలు విధించడం, దానిని ఒంటరిపాటు చేసే విషయమై భారత్‌ ఏ విధంగా సహకరిస్తోందో అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్‌కు సంవత్సరానికొకసారి నివేదిక సమర్పించాలని హైడ్‌ చట్టం నిర్దేశిస్తోంది. రెండు దేశాల మధ్య అణు సహకారం ఇందుకు అవకాశం కల్పిస్తోంది. జాతీయ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా భారత విదేశాంగ విధానంలో మార్పులు చేయడాన్ని వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
2005 జులైలో భారత్‌- అమెరికా సంయుక్త ప్రకటనపై జార్జి బుష్‌, మన్మోహన్‌ సింగ్‌ సంతకాలు చేసిన కొద్ది వారాల్లోనే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఎఇఎ చేసిన ప్రతిపాదించిన తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటు చేసింది. అలీన దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడమో, ఓటింగ్‌కు గైర్హాజర్‌ కావడమో చేయగా భారత్‌ అమెరికా ఆదేశాలకు అనుగుణంగా తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసింది. 2006 ఫిబ్రవరిలో ఇరాన్‌పై మరోసారి ఐఎఇఎ తీర్మానానికి అనుకూలంగా అది ఓటు చేసింది. హైడ్‌ చట్టంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ సందర్భంగా ఈ విషయాలను అమెరికా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.
గ్యాస్‌పైప్‌లైన్‌
ఇరాన్‌- పాకిస్తాన్‌- భారత్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ తదుపరి లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ముందడుగు వేయవద్దని అమెరికా పలుమార్లు భారత్‌ను హెచ్చరించింది. భారత్‌ దీనిని తు.చ తప్పకుండా పాటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును నిలిపివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. రెండు సంవత్సరాలకు పైగా వేచి చూసిన ఇరాన్‌, పాకిస్తాన్‌ ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించాయి. పాకిస్తాన్‌ సరిహద్దు వరకు ఈ పైప్‌లైన్‌ను ఇరాన్‌ ప్రస్తుతం నిర్మిస్తోంది.
తుర్క్‌మెనిస్తాన్‌-ఆప్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌- ఇండియా (టిఎపిఐ) పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ దిగుమతి చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. అమెరికా సూచన మేరకే భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఎఇఎలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యడంతో లిక్విఫయిడ్‌ గ్యాస్‌ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య 25 సంవత్సరాల ఒప్పందం ముగిసింది. ఇరాన్‌లో భారత వాణిజ్య ప్రాజెక్టులు అంచెలంచెలుగా రద్దవుతున్నాయి. అమెరికా బెదిరింపునకు తలవంచి రిలయెన్స్‌ 280 మిలియన్‌ డాలర్ల విలువచేసే గ్యాసోలిన్‌ ఎగుమతులను నిలిపివేసింది. ఇరాన్‌తో ప్రధాన వాణిజ్య సంబంధమైన చమురు ఎగుమతులు దాదాపు అంతరించిపోయే స్థితి నెలకొంది.
అమెరికాకు విజ్ఞప్తి
అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త కనిపించింది. భారత్‌- ఇరాన్‌ మధ్య ఏడు మాసాలుగా నెలకొనిఉన్న చెల్లింపుల సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో ఉందని ఆమెతో కలసి చెన్నరు సందర్శించిన అమెరికా అధికారి పేర్కొన్నట్లుగా ఆ వార్త పేర్కొంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని పెద్దన్న అమెరికాను భారత్‌ వేడుకున్నట్లు ఈ వార్త స్పష్టం చేస్తుంది. ఇరాన్‌ నుండి చమురు సరఫరాలు నిలిచిపోవడానికి అమెరికానే బాధ్యతవహించాల్సి ఉంటుంది. చమురు సరఫరాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఇటువంటి అక్రమ చర్యలను ప్రతిఘటించాల్సింది పోయి ఇరాన్‌ నుండి చమురును దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని అమెరికాను భారత్‌ దేబిరిస్తోంది.
పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకునేందుకు ఇరాన్‌ను ఒంటరి చెయ్యాలనే అమెరికా లక్ష్యానికి సహకరించడం ద్వారా భారత్‌ తన ప్రయోజనాలను పణంగా పెడుతోంది. అమెరికాకు సన్నిహిత మిత్రపక్షాలైన జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను కొనసాగిస్తూ అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ విధించిన ఆంక్షలకు విరుద్ధంగా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తుండగా భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా అమెరికా లక్ష్యానికి అనుగుణంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నాటో కూటమిలో భాగస్వామ్య దేశమైన టర్కీ చమురు రంగంలో ఇరాన్‌తో తాజాగా కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకుంది. చైనా కూడా ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను అధికం చేసింది. ఇరాన్‌ నుండి చైనా దిగుమతులు జూన్‌లో 53.2 శాతం పెరిగాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశం అయిన అణు ఒప్పందపు ఉక్కు సంకెళ్లకు బందీ అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యురేనియం శుద్ధి, అణు ఇంధనం రీప్రాసెసింగ్‌ సామర్థ్యం సంతరించుకోవడానికి దోహదం చేసే అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినందుకు ఇరాన్‌ను ఒంటరి చేయడంలో, ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు, నిర్దేశిత మార్గం నుండి దారి మళ్లేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు, అవసరమైతే ఆంక్షలు విధించేందుకు, కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ క్రియాశీలక భాగస్వామ్యం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్‌కు వార్షికంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైడ్‌ చట్టం నిర్దేశిస్తోంది. ఇతర దేశాల నుండి భారత్‌ ముడి చమురు దిగుమతి చేసుకోవచ్చు. అయితే అమెరికా ముందు సాగిలపడే యుపిఏ ప్రభుత్వ వైఖరి మన దేశ ఆత్మగౌరవాన్ని , దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.
-ప్రకాశ్‌ కరత్‌

మార్క్సిస్ట్ ఆగస్ట్ నెల సంచిక వెలువడుతోంది


Saturday, July 30, 2011

ముదిగొండ అమరుల స్ఫూర్తితో... మళ్లీ భూ పోరాటాలు

ముదిగొండ అమరవీరుల స్థూపం వద్ద నివాళ్ళర్పిస్తున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

ముదిగొండ భూ పోరాట అమరుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో వామపక్షాల ఆధ్వర్యాన సమైక్యంగా, ఉమ్మడిగా భూ పోరా టాలను నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రస్తుతం రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిస్‌, గిరిజన సంఘం ఆధ్వర్యాన దళితులు, గిరిజనులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆందోళనలు జరుగు తున్నాయన్నారు. కౌలు రైతుల సమస్యలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, గిరిజన ప్రాంతాల్లో వైద్యం తదితర సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత భూ పోరాటాలకు కార్యాచరణ రూపొంది స్త్తామని తెలిపారు. వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా చేపట్టడానికి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ముదిగొండ భూ పోరాట అమరవీరుల నాలుగో వర్థంతి సభ గురువారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సిఐటియు సీనియర్‌ నాయకులు రాజారావు, ప్రజా సంఘాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులు, దళి తులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాల వారికోసం ముదిగొండ అమరవీరులు ప్రాణత్యాగం చేశారన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలా లను, భూమి పంచాలంటూ చేసిన పోరాటంలో వారు తమ ప్రాణా లను ఫణంగా పెట్టారని చెప్పారు. ఆ అమరవీరుల ఆశయాలను పూర్తిగా సాధించలేకపోయినప్పటికీ వారి స్ఫూర్తితో దళితులకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, కౌలు రైతుల రుణార్హత కార్డులు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందజేయ టం తదితర అంశాల్లో పార్టీ, ప్రజా సంఘాలు పూర్తిగా నిమగమై ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీ ఏరియాల్లో వ్యాధుల నివారణకు ప్రభు త్వం చర్యలు చేపడితే పార్టీలు, ప్రజాసంఘాలు సాయం చేయటం సాధారణంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఆయా ప్రాంతాల్లో గిరిజన సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యాన వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారని గుర్తుచేశారు. తీరా గుర్తింపు కార్డులిచ్చిన తర్వాత రుణం కోసం రైతులు బ్యాంకుకెళితే అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కౌలు రైతులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. గిరిజనులు అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు పట్టాలివ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. అటవీ హక్కుల చట్టం అమలుకోసం పోరాడినందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియాలో ఇద్దరు పార్టీ కార్యకర్తలపై పిడి యాక్టు కింద కేసులు పెట్టారని అన్నారు. వారిని విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పారు. చివరికి కోర్టు జోక్యంతో వారు విడుదలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ముదిగొండ అమరుల స్ఫూర్తితో భవిష్యత్తులో వివిధ ప్రజా సమస్యలతోపాటు భూ సమస్యను ముందుకు తీసుకురావాల్సిన అవసరముందని రాఘవులు పిలుపునిచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ దున్నేవాడికే భూమి అనే నినాదంతో వీర తెలంగాణా సాయుధ పోరాట కాలం నుండి నేటి వరకు అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. ఈ పోరాటాల్లో పాల్గొని అనేక మంది పోలీసు తూటాలకు బలయ్యారని తెలిపారు. భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ఉపాధితోపాటు ఆదాయ వనరుకూడా కావటంతో భూ సమస్య అత్యంత కీలకమైందన్నారు. వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలవారి పిల్లలకు ఉపయోగపడే హాస్టళ్లు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను వారికి దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే వంద మంది పిల్లల కంటే తక్కువగా ఉన్న హాస్టళ్లను మూసేయాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ అంశాలపై ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాలు పోరాడుతున్నాయని, వాటికి సిపిఎం పూర్తి మద్దతునిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రజా సమస్యలపై ఇప్పటికే 11 వామపక్షాల ఆధ్వర్యాన ఆందోళనలు జరుతున్న నేపథ్యంలో...రాబోయే రోజుల్లో ఏయే అంశాలపై ఆందోళనలు నిర్వహించాలనే విషయమై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించేందుకు ఆగస్టు 4న లెఫ్ట్‌ పార్టీలు సమావేశమవుతున్నాయని తెలిపారు. తద్వారా ప్రజా సమస్యలపై పోరాటాల్ని బలోపేతం చేస్తామని చెప్పారు.

Thursday, July 28, 2011

మీ వ్యాఖ్యలు అభ్యంతరకరం

  • చిదంబరానికి రాఘవులు లేఖ
  • సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
మంగళవారం కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీల గురించి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తోంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించే విధంగా వ్యాఖ్యానించారని భావించాల్సి వస్తోందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే సిపిఐ (ఎం) అభిప్రాయమని తెలిసినప్పటికీ కేంద్ర హోం మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించటం చాలా అభ్యంతరకరమని పేర్కొంటూ చిదంబరానికి బుధవారానికి లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం...
మంగళవారం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పార్టీల గురించి ''ఆంధ్రప్రదేశ్‌ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. పార్టీలు అన్ని నిలువునా చీలిపోయాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్నీ చీలిపోయాయి. కేవలం ఇద్దరు సభ్యులున్న బిజెపి మాత్రమే, దీనికి మినహాయింపు'' అని మీరు చేసిన వ్యాఖ్య విస్తృతంగా ప్రచారం అయింది. మా పార్టీ వైఖరి మీకు బాగా తెలుసు. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి మా కేంద్ర కమిటి ఇచ్చిన అభిప్రాయం, మీ సమక్షంలో రెండు సార్లు జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో మా పార్టీ చెప్పిన అభిప్రాయం మీకు తెలుసు. రాష్ట్రం సమైక్యంగా వుండాలన్నది సిపిఐ(ఎం) అభిప్రాయమని మీకు తెలిసి కూడా ఇలా వ్యాఖ్యానించడం చాలా అభ్యంతరకరం. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి మీరు ఈ రకంగా వ్యాఖ్యానించినట్లు భావించవలసివస్తున్నది. రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితికి పూర్తిగా మీది, కేంద్ర ప్రభుత్వానిది భాధ్యత. శ్రీకృష్ణ కమిటి నివేదిక ఇచ్చి ఏడు నెలలు కావస్తున్నా రాష్ట్ర విభజన, సమైక్యత వివాదాన్ని పరిష్కరించకుండా నానబెడుతూ, కాలయాపన చేస్తూ ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర పార్టీలపై నెపం మోపుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి హాని చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రగతి దశాబ్దాల పాటు వెనకబడిపోయే ప్రమాదం వచ్చింది. పరిపాలన స్థంభించిపోయింది. ప్రజల గోడు పట్టించుకునే నాధుడే లేడు, ఇప్పటికైనా సమయం మించిపోకుండా సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాము''.

Tuesday, July 26, 2011

మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ సిపిఎం నుంచి బహిష్కరణ

ఇబ్రహీంపట్నం మాజీ శాసన సభ్యులు మస్కు నర్సింహను పార్టీ నుండి బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు డివిజన్‌ కమిటీ తెలిపింది. ఆయనను రెండు సంవత్సరాల క్రితమే అన్ని బాధ్యతల నుండి తొలగించినట్లు డివిజన్‌ కమిటీ పేర్కొంది. పార్టీ సభ్యునిగా ఉంటూ సంఘాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాడని కమిటీ పేర్కొంది. పార్టీని అప్రతిష్ట పాలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతారంపేట గ్రామంలో ప్రజలు పోరాడి సాధించుకున్న భూమిని అక్రమంగా తమ బంధువుల పేర రాయించుకున్నాడని డివిజన్‌ కమిటీ పేర్కొంది. కమిటీ పలుమార్లు హెచ్చరించినా తన విధానం మార్చుకోలేదని మండిపడింది. ఎమ్మెల్యే కాకముందు తన ఆస్తులను, ఎమ్మెల్యే అయిన తర్వాత తన ఆస్తులపై సిపిఎం ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారని పేర్కొంది. ఆయనను సరిదిద్దేందుకు పార్టీ ప్రయత్నించినా తన పద్ధతి మార్చుకోలేదంది. పార్టీ ప్రతిష్టను దిగజార్చినందుకే ఆయన్ను బహిష్కరిస్తున్నట్లు కమిటీ తీర్మానించింది.

ఏజెన్సీలో ప్రాణాంతక వ్యాధులు నివారించండి

  • వైద్యశాఖ మంత్రికి సిపిఎం వినతి
  • గిరిజన సంఘం, జెవివి ఆధ్వర్యాన వైద్య శిబిరాలు
  • తగు చర్యలు తీసుకుంటాం : డిఎల్‌ హామీ
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్‌, తదితర ప్రాణాంతక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట, తూర్పు గోదావరి, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లా ములుగు, తదితర ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో తగినంత మంది వైద్య సిబ్బంది, మందులు లేకపోవడం వల్ల గిరిజనులు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొంటూ సిపిఎం నేతలు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధు, శాసన సభ్యుడు జూలకంటి రంగారెడ్డి వైద్యశాఖ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డికి సోమవారం సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధుల విజృంభణ హెచ్చు స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో సిపిఎం బృందాలు పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు, ముంచంగిపుట్టుల్లో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణ కోసం అంబులెన్సులు, మందులు, వైద్య సిబ్బందితో పాటు ఇతర సహాయ సహకారాలను అందజేయాలంటూ మంత్రిని కోరామన్నారు.

మలేరియా, టైఫాయిడ్‌ నివారణకు తగు చర్యలు తీసుకుంటామని, వైద్య శిబిరాలకు అవసరమైన సాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఏజెన్సీల్లోని పిహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడం వల్ల టైఫాయిడ్‌, మలేరియా వ్యాధులను నిర్ధారించే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ కారణంగా ఆయా వ్యాధుల తీవ్రత తగ్గినట్లు కన్పిస్తోందని చెప్పారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ఏరియాలో 33 పిహెచ్‌సీలుంటే, రెండు నెలల క్రితం 15 పిహెచ్‌సీల్లో వైద్యులను నియమించారని తెలిపారు. వారు ఇతర ప్రాంతాల క్యాంపులకు వెళ్లినప్పుడు రిజిస్టర్‌ నమోదు చేసేవారు కూడా ఉండటం లేదని వివరించారు. పాడేరు ఐటిడిఎ పరిధిలోని 11 ఏజెన్సీ మండలాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధి తీవ్రంగా ఉందన్నారు. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రోజుకు 300 మంది జ్వర బాధితులను పరీక్షిస్తే వారిలో 60 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని అన్నారు. అంటువ్యాధుల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత ఇంతలా ఉండేది కాదన్నారు. పెరుగుతున్న జనాభా, వ్యాధుల తీవ్రతను బట్టి మందుల బడ్జెట్‌ను పెంచాల్సింది పోయి క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారని విమర్శించారు. ప్రాణాంతకమైన ఫాల్స్‌ఫామ్‌ (పిఎఫ్‌) మలేరియా విశాఖతోపాటు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో అత్యధికంగా ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత రీత్యా గిరిజన ప్రాంతాల్లో తక్షణం వైద్య సేవలందించేందుకు డిప్యూటేషన్‌పై డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందిని నియమించి మందుల సరఫరాను మెరుగుపరచాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. మందుల కొనుగోలుకు నిధుల కొరత లేకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన 758 హైరిస్క్‌ గ్రామాలన్నింటిలోనూ వైద్య శిబిరాలను ప్రత్యేకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పిహెచ్‌సి, సబ్‌సెంటర్లకు వైద్య నిమిత్తం వచ్చే రోగులకు, వారి సహాయకులకు భోజన సదుపాయం కల్పించాలని, రోగుల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చే సిహెచ్‌డబ్ల్యూలకు రవాణా ఖర్చులు చెల్లించాలని మధు, జూలకంటి కోరారు. ఈ అంశాలన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Sunday, July 24, 2011

మార్క్సిస్టు (జులై 2011)

ఉద్యోగుల ఆందోళనలు - రోగుల ఇబ్బందులు పరిష్కరించాలి

- ఉస్మానియా ఆస్పత్రి'పై సిఎంకు జూలకంటి లేఖ

రెండు రోజుల నుండి ఉస్మానియా ఆస్పత్రిలో జరుగుతున్న ఆందోళనల వల్ల రోగులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం ద్వారా రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలోని రేడియాలజీ, ల్యాబెటరీలు, కంప్యూటర్‌ విభాగాల్లో మొత్తం 40 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కింద గత 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి నెలకు రూ.3,500 నుండి 5 వేల వరకు మాత్రమే వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చే అరకొరా వేతనాలు కూడా ఆరు నెలకొకసారి చెల్లిస్తున్నారని వివరించారు. గత ఏడు నెలల నుండి జీతాలు చెల్లించకపోవటంతో వివిధ విభాగాల సిబ్బంది ప్రస్తుతం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. జీవోనెం.3 ప్రకారం పెంచిన వేతనాలను సైతం వీరికి చెల్లించటం లేదని పేర్కొన్నారు. కనీసం గాంధీ ఆస్పత్రిలో ఇస్తున్న వేతనాలను కూడా ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ ఉద్యోగులను రెన్యువల్‌ చేసుకోలేదని, ఆస్పత్రి అధికారులు ఈ విషయంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు రాకపోవటంతో ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, అభద్రతాభావంతో ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం రేడియోలజీ, ల్యాబ్‌ టెక్నీషియన్లు, కంప్యూటర్‌ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సంవత్సరాల తరబడి పనిచేస్తూ వృత్తినైపుణ్యం, అనుభవం కలిగిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఖాళీ పోస్టుల్లో క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయాలంటూ డిఎమ్‌ఇ అనుమతిస్తూ ఆస్పత్రి అధికారులకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా జూలకంటి గుర్తుచేశారు. అయినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయించాలని కోరారు. తద్వారా రోగుల ఇబ్బందులను తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.

పోరాటాలతోనే అవినీతి అంతం

  • దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలి
  • వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి అంతానికి కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటితోపాటు బలమైన ప్రజా పోరాటాలు నిర్వహించాలని 11 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మధ్య వెలుగు చూసిన 2జి స్పెక్ట్రమ్‌, కామన్వెల్త్‌ క్రీడలు, ఐపిఎల్‌, ఆదర్శ్‌ హౌసింగ్‌, తదితర కుంభకోణాల ద్వారా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, వారి అనుయాయులకు సంబంధించిన వివిధ కంపెనీలు ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున లూటీ చేశాయని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. తద్వారా దేశానికి, ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని విమర్శించారు. అవినీతి ద్వారా ఆర్జించిన సొమ్ముతో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంటున్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న కొద్దిపాటి హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రజలు అవినీతిపై పోరాడాల్సిన అవసరముందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్‌), సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ (ఎంఎల్‌), ఆరెస్పీ, ఎంఎల్‌ కమిటీ, ఎంసిపిఐ (యు), ఎస్‌యుసిఐ (సి) పార్టీల ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అవినీతి వ్యతిరేక సదస్సులు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని తీర్మానించింది.
పాలకులే కారణం : రాఘవులు
దేశ పాలకులే అవినీతికి ప్రధాన కారణమని సదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాట్లాడుతూ చెప్పారు. 1948 నుంచి ఇప్పటి వరకూ దేశంలో సాగిన కుంభకోణాల్లో రూ.900 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఈ అవినీతి సొమ్ములో దాదాపు రూ.71 లక్షల కోట్లు స్విస్‌బ్యాంకులో దాచి పెట్టారని అన్నారు. ఈ విధంగా ఇతర దేశాల్లో దాచిపెట్టిన సొమ్మును దేశానికి ఉపయోగపడకుండా చేస్తున్నారని విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో కొల్లగొట్టబడిన రూ.1,76,000 కోట్లతో దేశంలోని 120 కోట్ల మందికి కిలో బియ్యం రూ.2 చొప్పున ఏడాదిపాటు పంపిణీ చేయొచ్చని చెప్పారు. దేశంలోని పిల్లలందరికీ ఐదేళ్ల పాటు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఆహారం అందజేస్తూ ఉచిత విద్యనందించవచ్చని వివరించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతి వల్ల కేవలం దేశానికి నష్టం కలగడమేగాక ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలుగుతోందని చెప్పారు. రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయిలో అవినీతికి తోడు సాధారణ స్థాయి అవినీతి కూడా పెచ్చరిల్లడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మార్వో ఆఫీసుకో, ఒక ఆస్పత్రికో లేక మరో పోలీస్‌ స్టేషన్‌కో వెళ్తే లంచం ఇవ్వందే పని జరగడం లేదన్నారు. దీంతో సాధారణ ప్రజానీకం నానా ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయిలో అవినీతికి పాల్పడిన వారికి చట్టబద్ధంగా శిక్షపడే విధంగా చర్యలుండాలని అన్నారు. ఇదే సమయంలో జనలోక్‌పాల్‌ బిల్లు వస్తే దేశంలో అవినీతి పూర్తిగా అంతమవుతుందని భావించడం సరి కాదని అన్నారు. అవినీతి అంతానికి ఈ బిల్లు ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుందని, దీంతోపాటు బలమైన ప్రజా ఉద్యమాలు అవసరమని చెప్పారు. లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధానిని చేర్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎన్నికల విధానంలో మార్పులు తేవాలని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించి వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రాతినిధ్యాన్ని కల్పించాలని అన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలకు సైతం అవినీతిపై స్పష్టమైన విధానం ఉండాలని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణ కొనసాగు తున్న నేపథ్యంలో తన ఆస్తులపై జరుపుతున్న విచారణను ఆపాలంటూ జగన్‌ సుప్రీంకోర్టుకు వెళ్ళడాన్ని రాఘవులు తప్పుబట్టారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎవరైనా డిమాండ్‌ చేస్తే విచారణకు తాము సిద్ధమే అంటూ ప్రకటించాల్సింది పోయి సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు..
అవినీతిపై పోరాడే హక్కు లెఫ్ట్‌కే ఉంది : నారాయణ
దేశంలో అవినీతిపై పోరాడే నైతిక హక్కు కేవలం వామపక్షాలకే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విధాన నిర్ణయాల్లోనే రాజకీయ అవినీతి దాగుందని చెప్పారు. ఈ రాజకీయ అవినీతిని నిర్మూలించకుండా మొత్తం అవినీతిని నిర్మూలించలేమని అన్నారు. యుపిఎ-1 హయాంలో ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉన్నందు వల్ల అనేక ప్రజా వ్యతిరేక, అవినీతికర నిర్ణయాలను నిలువరించగలిగామని చెప్పారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్య ప్రభావం భారతదేశంపై పడలేదంటే దానికి కారణం వామపక్షాలేనని తెలిపారు. అణు ఒప్పందాన్ని లెఫ్ట్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వందల కోట్ల రూపాయలను యుపిఎ-1లోని పెద్దలు వెదజల్లారని విమర్శించారు.
సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమించిన సమయంలో అవినీతిలో కూరుకుపోయిన బూర్జువా పార్టీలు సైతం ఆయనకు మద్దతు పలకడం హాస్యాస్పందంగా ఉందన్నారు. సిపిఐ (ఎంఎల్‌) నాయకులు గుర్రం విజయకుమార్‌ మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల ఫలితంగా అన్ని రంగాల్లో అవినీతి విలయతాండవం చేస్తోందని చెప్పారు. ఈ సదస్సులో ఎన్‌ మూర్తి (సిపిఐ ఎంఎల్‌-లిబరేషన్‌), ఎల్‌ మురళీధర్‌ దేశ్‌పాండే (ఫార్వర్డ్‌బ్లాక్‌), జివి రాఘవులు (సిపిఐ ఎంఎల్‌), జానకిరాములు (ఆరెస్పీ), కొల్లిపర వెంకటేశ్వరరావు (ఎంఎల్‌ కమిటీ), మర్రెడ్డి వెంకటరెడ్డి (ఎంసిపిఐ-యు), సిహెచ్‌ మురహరి (ఎస్‌యుసిఐ-సి) ప్రసంగించారు.

Saturday, July 23, 2011

ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న రైతాంగం


రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటిలో అత్యధిక భాగం సముద్రంపాలవుతున్నది. ఒకచోట వర్షం పడుతున్నప్పుడు మరో ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వుండటం రాష్ట్రంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు బాగాపడి నీరు వృధా అవుతున్నప్పుడు ఆ నీటిని వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లోని చెరువు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. అంతేగాక ఒక పంటకు గ్యారెంటీ కల్పించవచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ జలవనరుల నిర్వహణలో ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నాయి.ప్రాజెక్టులలోని మిగులు జలాలను వినియోగించి చెరువు, కుంటలను నింపడానికి ఆ శాఖ విముఖంగా వుంది. ముఖ్యమంత్రి మొదలు సంబంధిత మంత్రి గతంలో చెప్పినప్పటికీ, ఇరిగేషన్‌ శాఖ దాన్ని పాటించలేదు.
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా నేటికీ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. 2011 ఖరీఫ్‌ పంటల సాగుకు సిద్ధమైన రైతు 13 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల (20-07-2011 నాటికి) విత్తనం వేయని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నేటికి 40 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి వుండగా 30 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వేసిన పంటల్లో వర్షాభావం కారణంగా 50శాతం పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి రెండోసారి ఎరువులు, విత్తనం కొరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువులు, విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. బ్లాక్‌మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేసే పరిస్థితి చిన్న సన్నకారు రైతులకు, కౌల్దారులకు లేదు. రాష్ట్రంలో రైతు కరువులు వరదలతో సహజీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువులు, వరదల నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి పథకాలను రూపొందించలేదు. కనీసం తాత్కాలికంగానైనా కంటెంజెన్సీ పథకాన్ని ప్రకటించి రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ శాఖ చొరవచూపట్లేేదు. ఎంతో కీలకమైన వ్యవసాయ శాఖకు పూర్తి బాధ్యతగల మంత్రి లేకపోవడం శోచనీయం. 2010-11లో 15 జిల్లాల్లో 669 మండలాల్లో 27 లక్షల ఎకరాల్లోని పంటలు అతివృష్టి వల్ల దెబ్బతిని 12 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వమే అంచనా వేసింది. వాస్తవానికి ఈ అంచనాలు ప్రాథమికమైనవే. వాస్తవ అంచనాలు ఇంతకుమించి వుంటాయి. కేంద్రాన్ని రు.9,373 కోట్ల సాయం కోరగా కేవలం రు. 481 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. ప్రధాని స్వయంగా ప్రకటించిన రు. 1000 కోట్లలో సగం మాత్రమే రాష్ట్రానికి చేరింది. రాష్ట్రం మరో రు. 500 కోట్లు తన బడ్జెట్‌నుంచి ఇచ్చింది. జరిగిన నష్టానికి ప్రభుత్వాలు అందించిన సహకారానికి మధ్య హస్తిమశకాంతరం వుంది.
వర్షాభావ పరిస్థితుల గణాంకాల సేకరణ కూడా అశాస్త్రీయంగానేవుంది. 750 మి.మీ. లోపు వర్షపాతం గల ప్రాంతాల్లో 2.5 మి.మీ. వర్షం పడితే వర్షపురోజుగా లెక్కిస్తారు. 750 మి.మీ.కు పైన వర్షపాతంగల ప్రాంతాల్లో 5మి.మీ. వర్షం పడితే వర్షపురోజుగా లెక్కిస్తారు. మాసంలో నిర్ణయించబడిన సాధారణ వర్షపాతం ఒకేరోజు పడి మిగతా రోజుల్లో డ్రైస్పెల్‌ (వర్షాలు లేకపోవడం)గా వున్నప్పటికీ వర్షాలు సక్రమంగా పడినట్లు గుర్తిస్తారు. వాస్తవానికి నెలలో పదిరోజుల తేడాతో మూడుసార్లు వర్షం పడినట్లయితే పంటలు నష్టం వాటిల్లదు. కానీ ఒకేరోజు 10 సెం.మీ. వర్షం పడి ఆ తర్వాత నెల రోజుల వరకు వర్షం పడనప్పటికీ నేటి వాతావరణ పరిస్థితుల జాబితాలో సక్రమంగా వర్షాలు పడినట్లు నమోదు చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతిని సవరించి ప్రస్తుత పంటల రక్షణ దృష్ట్యా వర్షాభావ పరిస్థితులను అంచనా వేయాలి. మరో 15 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్‌ మెట్టపంటల సీజన్‌ దాటిపోతుంది. ఇప్పటికే పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం ఖరీఫ్‌ సీజన్‌లో 8.17 లక్షల హెక్టార్లు వేయాల్సివుండగా నేటికి 3.77లక్షల హెక్టార్లు మాత్రమే వేశారు. నూనెగింజలు 17.74 లక్షలు వేయాల్సి వుండగా, 7.05 లక్షల హెక్టార్లు వేశారు. గత సంవత్సరం ఇదేరోజున వేసిన విత్తన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ 15 నుండి జూలై 15లోపు వేసిన పంటలు మాత్రమే మంచి ఫలితాన్నిస్తాయి. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు వేసిన పంటల దిగుబడి 50శాతం తగ్గుతుంది. పెట్టుబడి మాత్రం రెండు సందర్భాల్లో వ్యవసాయ పెట్టుబడిలో మాత్రం మార్పువుండదు. వర్షాభావ పరిస్థితులను సక్రమమైన అంచనా వేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కంటెంజెన్సీ పథకాన్ని (అత్యవసర పథకం) నిర్ణయించి అమలుచేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. 1956 నుండి పరిశీలిస్తే వ్యవసాయ శాఖ ఈ ప్రత్యేక పథకాన్ని రచించి అమలుజరిపిన దాఖలాలు లేవు. ఖరీఫ్‌ పథకాన్నే సెప్టెంబర్‌ 30 వరకు అమలుచేస్తున్నారు. 2011-12 సంవత్సరానికి జూలై 1న వ్యవసాయ శాఖ ప్రణాళిక విడుదల చేస్తూ 223 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా ప్రకటించింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయా?
2009-10లో వర్షాభావ పరిస్థితుల వలన 981 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ అందించిన సాయం నామమాత్రంగా కూడాలేదు. గత ఏడు సంవత్సరాలు ప్రకృతివైపరీత్యాల వల్ల జరిగిన నష్టపరిహారం చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని రు. 42,533.49 కోట్లు కోరగా, చేసిన సహాయం 1994.31 కోట్లు మాత్రమే. రాష్ట్ర వ్యవసాయ సాగును పరిశీలిస్తే కరువులు, వరదలు లేని సంవత్సరం లేదంటే అతిశయోక్తి కాదు. కరువులు, వరదల నష్టాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన 28 కమీషన్లు (1956 నుండి ) చేసిన సూచనల్లో ఏఒక్కటీ పాటించలేదు. పైగా, జాతీయ విపత్తుల నివారణా కమిటి ఏర్పాటు చేసి దానికి ఉపాధ్యక్షునిగా రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులొకరు కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ కమీషను వాస్తవ పరిశీలనలు చేసిన దాఖలాల్లేవు. ఆ కమిషన్‌ ప్రకటనలు పత్రికలకే పరిమితమవుతున్నాయి. కేంద్ర బృందాలను ఆహ్వానించడం, వారు సమాచారాన్ని సేకరించుకొని వెళ్ళడం ప్రతియేటా జరుగుతున్న తతంగమే.
వాతావరణం అనుకూలించి పంటలు పండితే ప్రభుత్వం తన విధానాల ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని చెప్పుకుంటోంది. వాతావరణం అనుకూలించకపోతే ప్రకృతిపైకి నెట్టివేసి ప్రభుత్వం తన బాధ్యతనుండి తప్పుకొంటున్నది. ప్రకృతివైపరీత్యాలను తట్టుకొనే విత్తనాలను కనుగొని రైతులకు అందించడంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం నూతన పరిశోధనలకు నిధుల కేటాయింపుల కోతపెట్టింది. చివరికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధనా కేంద్రాలన్నీ మూతవేశారు. వేల ఎకరాల విస్తీర్ణంలో గల ''ఇక్రిశాట్‌'' పరిశోధనల ఫలితాలు రాష్ట్ర రైతాంగానికి అందడంలేదు. ఇక్కడ జరుగుతున్న పరిశోధనల ఫలితాలు ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండ దేశాలకు పంపించి లాభాలు గడిస్తున్నారు. నేడు ప్రకృతిలో వస్తున్న మార్పుల ఫలితంగా (గ్లోబల్‌ వార్మింగ్‌) భూమి వేడెక్కి రుతువుల క్రమాన్ని మార్చివేసింది. ధనిక దేశాలు కార్బన్‌డయాక్సైడ్‌ను విపరీతంగా విడుదల చేస్తూ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఆ దేశాలు పేద దేశాలకు కార్బన్‌ రుణాలు (అడవుల పెంపకం) ఇచ్చి అడవులు పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఒత్తిడితెస్తున్నాయి. కానీ, తాము విడుదల చేస్తున్న ప్రమాదకరమైన కలుషితాలను మాత్రం తగ్గించుకోవడానికి నిరాకరిస్తున్నాయి.దీనివల్ల రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. అందుకే దీనిని ధనిక దేశాల పాపం అని చెప్పాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించడానికి తగిన ఏర్పాట్లను మన ప్రభుత్వాలు చేపట్టాలి. కానీ, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం మానేశాయి. ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాలే శిరోధార్యంగా అమలుచేస్తున్నాయి. ఆహార పంటల విస్తీర్ణాన్ని తగ్గించాలని, ధనిక దేశాలనుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలని ఆ దేశాలు తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి మన వ్యవసాయ విధానాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఆహారేతర పంటలు (ప్లాంటేషన్‌ పంటలు) వేశారు. మరో కోటి ఎకరాలు సాగుచేయకుండా బీడు భూములుగా వదిలేశారు. మొత్తం 3.50కోట్ల ఎకరాలు సాగుకు వినియోగంగా వుండగా, యిందులో 50శాతం మాత్రమే పంటలు వేస్తున్నారు. కనీసం ఈ పంటలనైనా కాపాడాలన్న లక్ష్యశుద్ధి ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగ రీత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో వుంది. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. నేడు అభివృద్ధి అయిన టెక్నాలజీని వినియోగించి మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించి పంటలను రక్షించవచ్చు. మేఘమథన టెక్నాలజీని వినియోగించాలంటే సొంత రాడార్లు, విమానాలు వుండాలి. కానీ, రాడార్ల కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తున్నది. కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా వర్షాలు పడకుండా మేఘాలను తరిమివేయడానికి ఈ టెక్నాలజీని వినియోగించారు. చైనాలో ఒలింపిక్స్‌ క్రీడల సందర్భంగా కూడా వర్షాలు రాకుండా నివారించారు. మన రాష్ట్రంలో మేఘమథనం బడ్జెట్‌ కింద కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితం శూన్యం. వర్షం పడుతున్నప్పుడే అందులోనే మేఘమథనం చేశామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటిలో అత్యధిక భాగం సముద్రం పాలవుతున్నది. ఒకచోట వర్షం పడుతున్నప్పుడు మరో ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వుండటం రాష్ట్రంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు బాగాపడి నీరు వృధా అవుతున్నప్పుడు ఆ నీటిని వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లోని చెరువు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. అంతేగాక ఒక పంటకు హామీ ఇవ్వొచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ జలవనరుల నిర్వహణలో ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నాయి. ప్రాజెక్టులలోని మిగులు జలాలను వినియోగించి చెరువు, కుంటలను నింపడానికి ఆ శాఖ విముఖంగా వుంది. ముఖ్యమంత్రి మొదలు సంబంధిత మంత్రి గతంలో చెప్పినప్పటికీ, ఇరిగేషన్‌ శాఖ దాన్ని పాటించలేదు. రాష్ట్రంలోని చెరువులు గొలుసుకట్టుగా వుండడం వల్ల నీరు వృధాకాకుండా రక్షించే చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని 74వేల చెరువు, కుంటలను మంచినీటి వనరులుగా తీర్చిదిద్దడంలో చిన్న నీటివనరుల శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది. దాదాపు 15వేల చెరువులు నీటిని నిల్వపెట్టగల స్థితిలో లేవు. ప్రపంచబ్యాంకు, జపాన్‌బ్యాంకు ఇచ్చే రుణసాయాన్ని ఉపయోగించి మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల వ్యయ అంచనా పెరుగుతున్నది.
ఇటువంటి వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కంటెంజెన్సీ పథకాన్ని ఏర్పాటుచేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాలను ఆవిష్కరించాలి. వర్షపాత వివరాలను సేకరించే విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించాలి. మేఘమథనం ద్వారా పంటలను రక్షించాలి. ప్రాజెక్టుల నీటిద్వారా చెరువు, కుంటలను నింపి భూగర్భ జలాలను పెంపొందించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కిందగల ఆయకట్టును ఆ శాఖే నిర్వహించాలి. పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండోసారి పంటవేయడానికి విత్తనాలు, ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
-సారంపల్లి మల్లారెడ్డి

Friday, July 22, 2011

ప్రపంచ ప్రజలు పనిచేస్తుంటే అమెరికా కడుపు నింపుకుంటోంది


  • సంక్షోభం నుండి బయటపడడం సులభం కాదు
  • జాతి వివక్ష కొనసాగుతోంది
  • తన యుఎస్‌ పర్యటన వివరాలను వెల్లడించిన రాఘవులు
ప్రపంచ దేశాలన్నీ పనిచేసిపెడుతుంటే అమెరికా తన కడుపు నింపుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. అమెరికాలో తలెత్తిన సంక్షోభం నుండి ఆ దేశం బయటపడటం అంత సులభమేమీ కాదన్న విషయం తమ పర్యటన ద్వారా తెలుసుకున్నామని ఆయన చెప్పారు. అక్కడ జాతి వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. తన వనరులన్నింటినీ ఆదా చేసుకున్న అమెరికా ప్రపంచ సంపదనంతా పోగేసి తమ పౌరుల జీవన ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరించిందనే విషయం అవగతమైందన్నారు. తన 20 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న రాఘవులు గురువారం స్థానిక ఎంబి భవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తన అమెరికా పర్యటన అనుభవాలను పంచుకున్నారు. అమెరికాలో తాను పర్యటించిన వివిధ దర్శనీయ, పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ప్రజల జీవన స్థితిగతులు, ఉద్యోగుల స్థితిగతులు, వివిధ రంగాల్లో పనిచేసే వారి అనుభవాలు, ప్రభుత్వ, ప్రయివేటురంగ సంస్థల పనితీరు, ట్రాఫిక్‌ నిబంధనలు, వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు, చట్టాలు, విద్య, వైద్యరంగాల్లో ప్రజలకందుతున్న సేవలు తదితర అంశాల గురించి విపులీకరించారు. ఆ విశేషాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే...

మనదేశ పౌరులు అమెరికా గొప్ప దేశం అంటూ పొగుడుతుంటారు. ఆ దేశంలోని పౌరుల జీవన ప్రమాణాలతో మన ప్రమాణాలను పోల్చుకుని ఆత్మ నూన్యతకు గురవుతుంటారు. అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు మన దేశంతో పోల్చిచూస్తే చాలా మెరుగైన స్థితిలో ఉన్న మాట వాస్తవమే. అక్కడ అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు కనీస వేతనం గంటకు 8 నుండి 10 డాలర్ల వరకు(ఒక డాలర్‌ 45 రూపాయలతో సమానం) ఉంటుంది. అదే స్కిల్డ్‌ పర్సన్స్‌కు అయితే గంటకు 14 నుండి 39 డాలర్ల వేతనముంటుంది. అంటే 8 గంటల పనివిధానం ప్రకారం అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు రోజుకు గరిష్టంగా రూ. 3,600, స్కిల్డ్‌ పర్సన్‌కు గరిష్టంగా రూ. 6,300 వేతనమిస్తారు. ఇల్లు లేనివారికి ప్రభుత్వమే సామూహిక గృహాల్ని కట్టించి ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ గృహాల్లోకి వెళ్ళేందుకు నిరాకరిస్తే బలవంతంగానైనా వారిని ఆ ఇళ్ళలోకి పంపిస్తారు. ఇళ్ళన్నీ కర్ర, కలపతోనే నిర్మిస్తారు. అందువల్ల ఏ గదిలోనైనా కుళాయి ద్వారా నీటిని లీక్‌ కాకుండా చూసుకోవాలి. శబ్దం చేయకుండా నడవాలి. ఇళ్ళల్లో సిగిరెట్లు తాగితే అవి తగలబడే ప్రమాదముంది కాబట్టి ఆరుబయటే వాటిని కాల్చాలి. గతంలో ఇంటి నిర్మాణానికి ఎలాంటి ముందస్తు చెల్లింపులూ లేకుండా రుణమిచ్చేవారు. ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం 10 శాతం డబ్బును చెల్లిస్తేనే రుణ సదుపాయం కల్పిస్తున్నారు. అమెరికాలో బ్రిటీష్‌ పద్ధతులన్నింటినీ వ్యతిరేకిస్తారు. మన దగ్గర దూరాన్ని కిలోమీటర్ల రూపంలో లెక్కిస్తే అమెరికన్స్‌ మైళ్ళ రూపంలో లెక్కిస్తారు. వాహనాలకు కుడివైపునే స్టీరింగ్‌ ఉంటుంది.

అక్కడి జనాలు రోడ్డుకి కుడివైపునే నడుస్తారు. అమెరికాలో పాఠశాల విధానం చాలా బాగుంది. పన్నెండో తరగతి వరకు అందరికీ ఉచిత విద్యనందిస్తారు. పిల్లలకు తిండి దగ్గర్నుండి పాఠ్య పుస్తకాల వరకూ అన్నీ ఉచితంగా అందిస్తారు. పన్నెండో తరగతి తర్వాత కేవలం ఉపాధిని చూపించే విద్యనే అందిస్తారు. ఇవిగాకుండా ఉన్నత చదువులు చదువుకోవాలంటే మాత్రం డబ్బు వెచ్చించాల్సిందే. ఇది అక్కడి పేదవాడికి పెనుభారంగా మారింది. వైద్యం విషయానికొస్తే ప్రభుత్వ, ప్రయివేటు, ట్రస్టు ఆస్పత్రులన్నీ ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే మాత్రం కచ్చితంగా 'ఆరోగ్య బీమా' చేసుండాల్సిందే. ఈ బీమా చేయించుకోకపోతే ఎంత పేదోడైనా డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిందే. కేవలం మరణం సంభవిస్తుందనుకున్న సమయంలో మాత్రమే బీమా లేనివారికి ఉచిత వైద్యాన్నందిస్తారు. మిగతా అన్ని సమయాల్లోనూ కచ్చితంగా డబ్బు వెచ్చించాల్సిందే. అమెరికా మొత్తం జనాభా 31 కోట్లు. వీరిలో 30 లక్షల మంది ఆరోగ్య బీమా చేయించలేదు. మరోవైపు ఆరోగ్య బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియాన్ని కంపెనీలు ఏడాదికేడాది పెంచేస్తుండటంతో సంపన్నులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఫాస్ట్‌ఫుడ్‌ చాలా చీప్‌. అదే రెస్టారెంట్‌లో అయితే మనం భరించలేనంత ఖరీదుంటుంది. అక్కడి ట్రాఫిక్‌ విధానం చాలా పద్ధతిగా, నిబంధనలు కఠినంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. ఒకవేళ వాహనదారులెవరైనా రెడ్‌ సిగల్‌ను దాటితే 45 డాలర్లు జరిమానాగా విధిస్తారు. ఈ విధంగా మూడుసార్లు జరిగితే వాహనదారుడి లైసెన్సును రద్దు చేస్తారు. అక్కడ వాహనాలకు కూడా బీమా చేయిస్తారు. వాహనదారుడెవరైనా మాటిమాటికీ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రమాదాలు చేస్తుంటే అతని వాహన బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియాన్ని కంపెనీలు పెంచుతాయి. ఇన్ని కఠిన నిబంధనలు ఉన్నందువల్లే అక్కడి పౌరులు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తారు. 'మా దగ్గర జీతాలెక్కువగా ఉంటాయి కాబట్టి అవినీతి తక్కువగా ఉంటుంది' అని అక్కడి పౌరులు చెప్పారు. అయితే ఉన్నతస్థాయిలో అవినీతి ఉన్న విషయాన్ని మేం గుర్తించాం. ఈ విధంగా అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నప్పటికీ వారు కూడా కొన్ని విషయాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జాతి వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. నల్లజాతివారు ఒక దగ్గర, ఆసియన్లు మరో దగ్గర, తెల్లజాతివారు ఇంకో దగ్గర నివసిస్తుంటారు. నల్లజాతివారు లేదా ఆసియన్లు తమ ప్రాంతాల వద్దకొచ్చి నివాసాలేర్పర్చుకుంటే తెల్లజాతివారు ఆ ప్రదేశాలను ఖాళీ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి పౌరులు, ఇతర దేశాల నుండి ఉద్యోగార్థం వెళ్ళిన వారు(వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు) అభద్రతాభావానికి గురవుతున్నారు. ప్రస్తుతం డాలర్‌ ప్రింటింగ్‌ మీదనే ఆధారపడి ఆ దేశం బతుకుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ డాలర్‌ చెలామణిలో ఉండటమే దీనికి కారణం. ఒకవేళ ఇతర దేశాల మీద డాలర్‌ పెత్తనం పడిపోతే అమెరికా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ పనిచేసి పెడుతుంటే... అమెరికా తన కడుపు నింపుకుంటోంది. అమెరికాకు వెళ్ళకముందు మీడియాలో వస్తున్న వార్తలనుబట్టి ఆదేశం ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతుందని భావించాం. ఇప్పుడు ప్రత్యక్షంగా అమెరికాకు వెళ్ళి చూసిన తర్వాత సంక్షోభం నుండి అది గట్టెక్కటం అంత సులభమేమీ కాదనే విషయం స్పష్టమైంది.

Thursday, July 21, 2011

పటిష్ట లోక్‌పాల్‌ అవశ్యం

    లోక్‌పాల్‌ పరిధి, అది నిర్వహించాల్సిన పాత్రపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించి ప్రధాన అంశాలపై భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) తన వైఖరిని స్పష్టం చేస్తూ సవివరమైన పత్రాన్ని విడుదల చేసింది.
   గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా బయల్పడిన కుంభకోణాల నేపథ్యంలో అవినీతి ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇప్పటికీ లక్షలాది మంది దుర్భర పేదరికంలో మగ్గుతూ, ఆకలితో అలమటిస్తూ సామాజిక, ఆర్థిక అవకాశాలకు దూరమై జీవితాలు వెళ్లదీస్తున్న భారత్‌ వంటి నిరుపేద దేశాల్లో అవినీతి చర్యల ద్వారా ప్రజావనరులను కైంకర్యం చెయ్యడం తీవ్రమైన నేరం. అవినీతి అభివృద్ధికి ప్రతిబంధకం మాత్రమే కాదు. అవినీతి ద్వారా సంపాదించిన అక్రమార్జన మన సమాజంలో అసమానతలను పెంచుతోంది. మన సామాజిక వ్యవస్థను చెరచివేస్తోంది.
ఇటీవల వెలుగుచూసిన 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు, కామన్వెల్త్‌ గేమ్స్‌ మొదలైన కుంభకోణాలు వేలాది కోట్ల రూపాయల ప్రజా వనరులను ఒక వర్గం కార్పొరేట్స్‌, బ్యూరోక్రాట్లు, మంత్రులు ఏ విధంగా కొల్లగొట్టారో బట్టబయలు చేశాయి. నేరాలకు పాల్పడిన మంత్రులను నెలల తరబడి అధికారంలో కొనసాగించి దర్యాప్తులను భ్రష్టుపట్టించి న్యాయాన్ని అటకాయించడం మరీ ఘోరమైన విషయం. ఉన్నత స్థాయిలో అవినీతి మన రాజకీయ వ్యవస్థలో అనేక దశాబ్దాలుగా సర్వసాధారణ విషయంగా పరిణమించింది. సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టిన తరువాత విధాన నిర్ణాయక ప్రక్రియ పూర్తిగా భ్రష్టుపట్టింది. నయా ఉదారవాద వ్యవస్థలో బడా కార్పొరేట్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య అక్రమ సంబంధాల కారణంగా మరింతగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదంలో పడింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అనర్హులను అందలం ఎక్కించి నేరాలను ప్రోత్సహించేదిగా ఉంది. రాజకీయ, న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే అవినీతిపై పోరాటం విజయవంతమవుతుంది. ఒకేఒక చర్య లేదా అరకొర చర్యలతో ఇది సాధ్యం కాదు.. పటిష్టమైన లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు చేపట్టాల్సిన చర్యల్లో ఒకటి. ఇందుకు అనుబంధంగా ఇతర చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. చట్టపరంగా పౌరుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఉన్నత న్యాయవ్యవస్థ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చెయ్యాలి. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టాలి. లోపాలను చక్కదిద్ది నల్లధనాన్ని వెలికితీసేందుకు సత్వర ప్రాతిపదికపై పన్నుల వ్యవస్థను సంస్కరించాలి. నల్లధనంలో అధికభాగం విదేశాల్లో, పన్నులు సరళంగా ఉండే దేశాల్లోని బ్యాంకుల ఖాతాల రూపంలో ఉంటాయి. వ్యాపార, రాజకీయ, బ్యూరోక్రాట్ల మధ్య రహస్య సంబంధాలను అంతమొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. సమగ్ర సంస్కరణలు తీసుకురావడం ద్వారా మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుంది.
లోక్‌పాల్‌ బిల్లు
   స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉంది. అవినీతి, అధికార దుర్వినియోగం కారణంగా ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఈ వ్యవస్థ అవకాశం కల్పించింది. నాలుగు దశాబ్దాలపాటు లోక్‌పాల్‌ బిల్లు భారత పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేకపోయింది. అవినీతిపై పోరాడడంలో రాజకీయ చిత్తశుద్ధిలేకపోవడమే ఇందుకు కారణం. గతంలో అనేకసార్లు ప్రభుత్వాలు లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించాయి. అయితే వేర్వేరు కారణాలతో ఇవి వెనక్కుపోయాయి. ఈ బిల్లుపై చర్చను ప్రారంభించేందుకు ప్రస్తుత యుపిఎ-2 ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదురైంది. అవినీతి కుంభకోణాలు వరుసగా బయల్పడటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో అనివార్యంగా అవినీతిపై చర్చలు ప్రారంభించడం ప్రభుత్వానికి అనివార్యమైంది. ఉన్నత స్థానాల్లో అవినీతిపై విచారణ జరిపే లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలి.
లోక్‌పాల్‌ పరిధి, అది నిర్వహించాల్సిన పాత్రపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించి ప్రధాన అంశాలపై భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) తన వైఖరిని స్పష్టం చేయాలని భావిస్తోంది.
1.అవినీతికి నిర్వచనం
    లంచం తీసుకోవడం, ఇతరులను ప్రభావితులను చేసి తమకు అనుకూలంగా మలచుకోవడం, ఆశ్రితపక్షపాతం, అనర్హులను అందలం ఎక్కించడం, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడటం, నిధుల దుర్వినియోగానికి పాల్పడటం, అధికారులకు ముడుపులు చెల్లించడం, నేరాల్లో భాగస్వామ్యం వహించడం అవినీతిలో అంతర్భాగాలు.
1988 అవినీతి నిరోధక చట్టం ఏయే నేరాలు అవినీతి కిందకు వస్తాయో నిర్వచించింది. ఈ నిర్వచనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత లాభం కోసం లేదా ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడతారని భావించడం అవినీతిపై పరిమిత అవగాహన మాత్రమే కల్పిస్తుంది. అనేక సందర్భాల్లో ఒక ప్రయివేటు కంపెనీకి లాభం చేకూర్చేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. 1988 అవినీతి నిరోధక వ్యక్తి అనే పదానికి ఇచ్చిన నిర్వచనం పరిధిలోకి ఈ కంపెనీ రాదు. అనేక సందర్భాల్లో ముడుపులు, నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడం, నిగ్గు తేల్చడం అత్యంత కష్టమవుతుంది. అయితే కోశాగారానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ఉదాహరణకు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పిఎస్‌యు) విక్రయించడం.
    ఏదేనీ వ్యక్తికి లేదా సంస్థకు ఉద్దేశపూర్వకంగా అక్రమమైన మార్గంలో లాభం లేదా అక్రమంగాలబ్ధి చేకూర్చడం లేదా ఏదేనీ ప్రభుత్యోద్యోగి లేదా ప్రజా సేవకుడి నుండి చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లబ్ధి పొందడాన్ని కూడా అవినీతి నిర్వచనం పరిధిలోకి తీసుకురావాలి.
2. విధులపై స్పష్టత
లోక్‌పాల్‌ ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు జరిపి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న కేసులను లేదా ప్రాసెక్యూషన్‌ చేసి శిక్షించతగ్గ కేసులను ప్రత్యేక కోర్టులకు నివేదించడం వంటి కార్యక్రమాలను నిర్దిష్ట కాల పరిమితిలో నిర్వహించాలి. సుమోటోగా దర్యాప్తుకు సిఫార్సు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండాలి. కేంద్రీయ స్థాయిలో అవినీతికి సంబంధించిన కేసులపై విచారణ జరిపేందుకు అందుబాటులో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. చివరగా, నిర్దిష్ట చర్యను సిఫార్సు చేసే లేదా ఇది సాధ్యం కాని చోట కోర్టులకు వెళ్లేందుకు దానికి అధికారం ఉండాలి.
లోక్‌పాల్‌కు క్వాజీ జ్యుడీషియల్‌ అధికారాలు కల్పించాలి. ఈ బాధ్యతలను స్వతంత్రంగా, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధికి లోబడి నిర్వర్తించేందుకు సార్వభౌమాధికారం కల్పించాలి.
శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రాజ్యాంగం మౌలిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉంది. లోక్‌పాల్‌ వ్యవస్థ ఈ మౌలిక స్వరూపానికి అనుగుణంగా ఉండాలి.
లోక్‌పాల్‌ అవినీతికి సంబంధించిన కేసులను విచారిస్తుందా లేక సమస్యల పరిష్కార కేంద్రంగా కూడా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. ఈ రెండు విధుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని సిపిఎం కోరుతోంది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ప్రత్యేక శాసనం ద్వారా దీనిని ఏర్పాటు చెయ్యాలి. పౌర నిబంధనావళికి సంబంధించిన సమస్యలను ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి.
3. లోక్‌పాల్‌ ఎంపిక, కూర్పు
ఈ చట్టం తీసుకురావడంలో ఉద్దేశాన్ని లోక్‌పాల్‌ చట్టం స్పష్టంగా నిర్దేశించాలి. లోక్‌పాల్‌ను నియమించేందుకు పరిగణనలోకి తీసుకునే సామర్థ్యం, అనుభవం, అర్హత మొదలైన అంశాలపై స్పష్టమైన ప్రమాణాలను నిర్దేశించాలి. లోక్‌పాల్‌ను ఎంపిక చేసే కమిటీ విస్తృత ప్రాతిపదికతో కూడుకున్నదై ఉండాలి. అందులో కార్యనిర్వాహక అధికారులు, పార్లమెంటరీ నాయకులతో, ఉన్నత న్యాయ వ్యవస్థ సభ్యులు, న్యాయమూర్తులు, విద్యావేత్తలకు చోటు కల్పించాలి. ఎంపిక కమిటీ నియమించిన సెర్చ్‌ కమిటీ కూడా విస్తృత ప్రాతిపదిక కలిగినదై ఉండాలి.
కూర్పు: ఛైర్‌పర్సన్‌తో పాటు లోక్‌పాల్‌లో మొత్తం పది మంది సభ్యులు ఉండాలి. ఇందులో నలుగురు న్యాయవ్యవస్థకు చెందిన వారై ఉండాలి. ముగ్గురు పాలనా యంత్రాంగం, పౌర సర్వీస్‌ నేపథ్యం గలవారై ఉండాలి. మిగిలిన ముగ్గురు న్యాయ, విద్యా, సామాజిక సర్వీస్‌ రంగానికి చెందినవారై ఉండాలి. వాణిజ్య, పరిశ్రమల రంగానికి చెందినవారికి, రాజకీయ నాయకులకు స్థానం కల్పించరాదు.
పరిధి : ఉన్నత స్థానాల్లో అవినీతిని ప్రాధాన్యతా ప్రాతిపదికపై నిర్మూలించాలి. దైనందిన జీవితంలో, అధికారులతో వ్యవహరించే సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొనే అవినీతిని అత్యవసర ప్రాతిపదికపై పరిష్కరించాలి. ఇటువంటి అవినీతిలో అధిక భాగం రాష్ట్ర స్థాయిలో అధికారులతో జరిపే వ్యవహారాలకు సంబంధించినవై ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లను లోక్‌పాల్‌ తరహాలో నియమించిన లోకాయుక్తల పరిధిలోకి తీసుకురావాలి. మనం ప్రతిపాదించిన సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని విడిగా ఏర్పాటు చెయ్యాలి. మౌలిక సర్వీసులు, పౌరుల హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ యంత్రాంగం పరిష్కరించాలి.
ఎ.ప్రధాని: తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రధాన మంత్రిని లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలి. ప్రధాన మంత్రి, ప్రజా సేవకులందరినీ 1969లో అప్పటి విపిసింగ్‌ ప్రభుత్వం లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆ తరువాత రూపొందించిన ముసాయిదా బిల్లుల్లో కూడా ప్రధానమంత్రిని లోక్‌పాల్‌ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని స్థాయీ సంఘం కూడా 2011 లోక్‌పాల్‌ బిల్లును పరిశీలించే సమయంలో ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 1989 తరువాత మొదటిసారి అనేక కుంభకోణాలకు ఆలవాలమైన ఈ ప్రభుత్వం అత్యున్నత కార్యాలయానికి నిర్దిష్ట బాధ్యతలను నిర్ధారించేందుకు నిరాకరిస్తోంది. ప్రధానితోసహా అవినీతి నిరోధక చట్టం నిర్వచనం కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ సేవకులనందరినీ లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలి.
బి. న్యాయవ్యవస్థ: న్యాయవ్యవస్థను కూడా నిఘా వ్యవస్థ పరిధిలోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులను వారు నిర్వహించే కార్యకలాపాలకు బాధ్యులుగా చెయ్యాలి. వారిపై వచ్చే అవినీతి ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసి దర్యాప్తు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన వారికి రక్షణ కవచంగా పరిణమించింది. అయితే వారిని లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు రాజ్యాంగం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిన స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించడమే అవుతుంది. ఎవరైనా దురుద్దేశంతో న్యాయమూర్తుల కార్యకలాపాలపై ఆరోపణలు చేస్తే లోక్‌పాల్‌ దర్యాప్తు జరపడం వల్ల వారు నిర్భీతిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉండదు.
సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను జాతీయ న్యాయ కమిషన్‌ పర్యవేక్షించాలి. ఉన్నత స్థాయిలో నియామకాలను, వారి ప్రవర్తనను అదే పర్యవేక్షించాలి. వారిపై వచ్చే అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చెయ్యాలి. ఇందుకోసం అవసరమైన శాసనాన్ని చెయ్యాలి. 2010 న్యాయ ప్రమాణాలు, బాధ్యతల నిర్ధారణ బిల్లు ఈ దిశగా ఎంతమాత్రం సరిపోదు.
సి.పార్లమెంటు సభ్యులు: పార్లమెంటు సభ్యులు అవినీతికి పాల్పడితే వారిపై దర్యాప్తు జరిపి చర్య తీసుకునే ప్రస్తుత వ్యవస్థ లోపభూయిష్టంగా, అసంతృప్తికరంగా ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ, ఓటింగ్‌లో పాల్గొనే స్వేచ్ఛ కల్పించడం ద్వారా రాజ్యాంగంలోని 105వ ప్రకరణం పార్లమెంటు సభ్యులకు రక్షగా ఉంది. ఈ స్వేచ్ఛ, రక్షణలు పార్లమెంటు సభ్యుల అవినీతి చర్యలకు విస్తరించకుండా ఏమి చేయాలన్నదే అసలు సమస్య.
105వ ప్రకరణాన్ని సవరించడమే ఇందుకు మార్గం. రాజ్యాంగ పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ ప్రకరణాన్ని సవరించాలి.
ఇందుకు ప్రత్యామ్నాయంగా పార్లమెంటులో ఓటింగ్‌, మాట్లాడటం వంటి చర్యలను ప్రేరేపించే విధంగా పార్లమెంటు సభ్యుడెవరైనా అవినీతికి పాల్పడితే ఆ అవినీతి చర్య అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షా స్మృతి పరిధిలోకి వచ్చే విధంగా సాధ్యమైతే శాసనం చెయ్యాలి.
5.లోకాయుక్తలు: రాష్ట్రాల్లో లోకాయుక్తలను కేంద్రంలో లోక్‌పాల్‌ తరహాలో నియమించాలి.
6. ఫిర్యాదిదారుల రక్షణ: అవినీతిపై పటిష్టంగా పోరాటం చేసేందుకు అవినీతిపై ఫిర్యాదు చేసే వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది లోక్‌పాల్‌ విధి నిర్వహణలో భాగం కావాలి. ఇందుకు చట్టపరంగా అవకాశం కల్పించాలి. 2010 ప్రజాప్రయోజన విషయాల వెల్లడి (సమాచార రక్షణ) చట్టం ఇందుకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాలి.
7.బడా వ్యాపార- ప్రజాసేవకుల రహస్య సంబంధాలు:
బడా పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామికవేత్తలు- ప్రభుత్వ సేవకుల మధ్య రహస్య సంబంధాలు అవినీతికి మూలాలనే విషయాన్ని గుర్తించాలి. వ్యాపార సంస్థలతో సంబంధంగల కేసులను దర్యాప్తు చేసే లోక్‌పాల్‌ అవినీతి పద్ధతుల ద్వారా ఆ సంస్థలు తీసుకునే లైసెన్స్‌లు, కుదుర్చుకునే ఒప్పందాలు, లీజ్‌లను రద్దు చెయ్యాలి. అటువంటి కంపెనీలను భవిష్యత్తులో ఎటువంటి కాంట్రాక్టులు, లైసెన్స్‌లు పొందకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అధికారం కూడా లోక్‌పాల్‌కు ఉండాలి. అదేవిధంగా లబ్ధిదారుడు వ్యాపార సంస్థ అయితే కోశాగారానికి వచ్చే నష్టాన్ని ఆ సంస్థ నుండి వసూలు చెయ్యాలని సిఫార్సు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండాలి. ప్రభుత్వం ఈ సిఫార్సులను మామూలుగా అమోదించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
ముగింపు: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడంతోపాటు అవినీతికి వ్యతిరేకంగా న్యాయ, పాలనాపరమైన వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ఏక కాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం భావిస్తోంది. ఇందుకుగాను ఈ కింది చర్యలు తీసుకోవాలి.
1.జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థను దాని పరిధిలోకి తీసుకురావాలి. 2.పౌరుల సమస్యలు పరిష్కరించేందుకుగాను వారి హక్కుల పరిరక్షణకై ఒక చట్టం తీసుకురావాలి. 3.పార్లమెంటు సభ్యులను అవినీతి నిరోధక నిఘా కిందకు తీసుకువచ్చేందుకు రాజ్యాంగంలోని 105వ ప్రకరణాన్ని సవరించాలి. 4.ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టాలి.
5.రాష్ట్రాల స్థాయిలో ప్రజాసేవకులందరికీ వర్తించే విధంగా లోకాయుక్తలను నియమించాలి 6.నల్లధనాన్ని వెలికితీసి సరళతరమైన పన్నుల వ్యవస్థ గల దేశాల్లోని (టాక్స్‌ హావెన్స్‌) నిధులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

సూత్రబద్ధ వైఖరితో ప్రజల పక్షాన నిలబడ్డ సిపిఎం


రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన వందమంది శాసన సభ్యులతో సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీర్ఘకాలంగా మగ్గుతున్న తెలంగాణా సమస్యను పరిష్కరించటంలో కేంద్ర ప్రభుత్వ నాన్చుడు వైఖరి, కాంగ్రెస్‌ అధిష్టానం అవకాశవాద వైఖరి ప్రస్తుత దుస్థితికి కారణం. పరస్పర విరుద్ధ్ద ప్రకటనలతో జనాన్ని గందరగోళపరచింది వారే. శ్రీకృష్ణకమిటీని నియమించింది వారే. తదనంతరం దానిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తూ కాలయాపన చేసిందీ వారే. ఆ పేరుతో రాజీనామాలకు తెరతీసిందీ వారే. దీనితో సమస్య మరింత జటిలం అయింది. ఇప్పటికైనా ఈ సమస్యను జాగు చేయకుండా పరిష్కరించి రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రానిదే.
రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులపై ఆందోళనాకారులు అనేకచోట్ల వత్తిళ్లు తెస్తున్నారు. యంఐయం, లోకసత్తా, సిపియం పార్టీలు తమ అభిప్రాయాలకనుగుణంగా రాజీనామాలు చేయలేదు. కొంతమంది కాంగ్రెసువారు కూడా రాజీనామాలు చేయలేదు. అందులో ఎక్కువమంది హైదరాబాద్‌ నగరానికి చెందినవారే. తమ నియోజకవర్గాల ప్రజల మనోభావాలకనుగుణంగానే తామీ నిర్ణయం తీసుకున్నామని వారంటున్నారు. సిపిఎం శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి కూడా రాజీనామా చేయాలని ఆయన ఇంటి ముందు ఎబివిపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయం ముందు కూడా కొంతమంది ధర్నా చేశారు. భువనగిరి కార్యాలయానికి నిప్పంటించారు. ఇంకా అక్కడా ఇక్కడా దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు. నిరసనకు గురికావాల్సినంత రాజకీయ, నైతిక తప్పులేవీ సిపిఎం చేయలేదు. రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్యత కూడా సిపియంపై లేదు. సిపిఎం పార్టీ గాని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కాని తాము ప్రత్యేక తెలంగాణ తెస్తామని ఏనాడూ ప్రజలకి వాగ్దానం చేయలేదు. ఆ పేరుతో ఓట్లడిగి మోసమూ చేయలేదు. తన వైఖరిని నిజాయితీగా ప్రజలకి చెప్పి గెలుపైనా, ఓటమైనా ఒకే స్ఫూర్తితో స్వీకరించింది. ప్రత్యేక తెలంగాణ తెస్తామని ప్రజల్ని మురిపించి, హామీలిచ్చి, వాగ్దానాలు చేసినవారే ప్రజలకు ఈ విషయంపై జవాబు చెప్పుకోవాలి. అలాంటి కొంతమంది నేడు రాజీనామాలకి పూనుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌లోనే అంతర్గత విబేధాలున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. సమస్యకు మూలమైన కేంద్ర, రాష్ట్ర పాలకుల్ని వదిలి ప్రతిపక్ష పార్టీలపైన, అందునా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం లాంటి పార్టీలపై దాడులకు పూనుకోవడం సమంజసం కాదు. ఆందోళనకారుల మనోభావాలను రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కొంతమంది పనిగట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో అసలు దోషులెవరో ప్రజలు గుర్తించాలి.
ప్రత్యేక తెలంగాణ విషయంలో సిపిఎంకు, ఇతర పార్టీలకు విబేధాలున్నమాట వాస్తవం. అంతమాత్రాన ప్రత్యేక తెలంగాణ కోరుతున్న కాంగ్రేసేతర లౌకిక పార్టీలను సిపిఎం తన శత్రువులుగా భావించడం లేదు. సమస్యతో విభేదించినా ఆందోళనాకారులపై సాగే నిర్బంధకాండను ప్రజాస్వామిక స్పూర్తితో ఖండిస్తూ వస్తోంది. పైగా ప్రజల రోజువారీ సమస్యలపై ఆయా పార్టీలతో కలిసి పనిచేస్తున్నది. రాష్ట్ర స్థాయిలో వామపక్షాలు అనేక సమస్యలపై ఉమ్మడి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో సైతం లౌకికపార్టీలు సహకరించుకొని పనిచేశాయి. వామపక్షాలపై ఆధారపడి వున్న యుపిఎ – 1 హయాంలో సిపిఎంపై నెపం నెట్టి కాంగ్రెస్‌ తప్పించుకొనే యత్నం చేసింది. కాంగ్రెస్‌ దుష్టాలోచనను ఆనాడే సిపియం ప్రశ్నించి నిలదీసింది. దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చి పెట్టే అణు ఒప్పందాన్ని సైతం వామపక్షాలను ఖాతరు చేయకుండా ఆమోదింపజేసుకొన్న ఘనత కాంగ్రెసుది. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను సిపిఎం వ్యతిరేకించినా పునరుద్ధరించిన విషయాన్ని ఆనాడే రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదని చిదంబరం అంటున్నారు. కాంగ్రెసు తన అంతర్గత సంక్షోభాన్ని రాష్ట్రప్రజలపై రుద్దుతున్నదనేది స్పష్టం. ఇప్పుడు కాంగ్రెస్‌ తప్పుడు విధానాలను ప్రజలు గుర్తించడంతో బోనులో నిలబడక తప్పలేదు. తమ పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఇతర పార్టీలపైన, తమ పార్టీలోనే ముఠాల మధ్య దాడులకు పాల్పడుతున్నది. ఇరు ప్రాంతాల నాయకులు పరస్పరం దూషించుకోవడం, అడ్డసవాళ్లు విసురుకోవడంతోనే ఆగకుండా ఇరు ప్రాంతాల ప్రజల మధ్యా విద్వేషాలు రాజేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇరు ప్రాంతాల ప్రజలు, ఆందోళనాకారులు వీరి ఉచ్చులో ఇరుక్కోకుండా కేంద్ర ప్రభుత్వ అస్పష్ట వైఖరిని నిలదీసి తేల్చుకోవాలి.
పనిలో పనిగా కొంతమంది తమ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి ప్రత్యర్థులపై దాడులు చేయడానికి ఉద్యమాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఎవరు ఎవరిపై భౌతికదాడులకు పాల్పడ్డా అది సమర్థనీయం కాదు. దానితో ఏ సమస్యా పరిష్కారం కాదు పరస్పర ద్వేషాలు పెరగడం తప్ప. దురదృష్టవశాత్తు వామపక్షాల మధ్య ఈ సమస్యపై వచ్చిన తేడాలు కూడా దీనికి ఒక కారణమౌతున్నాయి. ఒకే ఉద్యమ లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీల మధ్య తాత్కాలిక ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే భవిష్యత్‌ వామపక్ష ఉద్యమ పురోగమనానికే అది ఆటంకమవుతుందని గుర్తించాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మతోన్మాదశక్తులు పేట్రేగిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు బలపడితే వచ్చే ముప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణాను దోచుకుంటున్నారని, వారితోనే తమకు పేచీ అని ప్రత్యేక తెలంగాణావాదులంటున్నారు. ఈ పెట్టుబడిదారులకు సిపియం ప్రాతినిధ్యం వహిస్తున్నదా? కాదని అందరికీ తెలుసు. ఏ పార్టీలు ఈ వర్గాలను మోస్తున్నాయో కూడా తెలుసు. పైగా అది రోజూ పోరాడేది ఇలాంటి వర్గాలకు వ్యతిరేకంగానే. ఇలాంటి పార్టీపై దాడి ఎవరికి మేలు చేస్తుంది? ఈ పెట్టుబడిదారులు తెలంగాణా ప్రజల్నే కాదు కోస్తా సీమ ప్రజల్ని కూడా దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారులకు ప్రాంతం, కులం, మతం ఉండవు. తెలంగాణాతో సహా రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడిదారులే కాదు వివిధ దేశాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. ప్రపంచీకరణ పేరుతో దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలను తరలించుకుపోతోంది ఎవరు? ఏ ప్రాంతం వారు? ఇలాంటి బడా కార్పోరేట్‌ శక్తులకు లాభమే పరమావధి. లాభం కోసం ఎక్కడికైనా పోతారు. ఎవరినైనా దోపిడీ చేస్తారు. అలాంటి వర్గాలకు వ్యతిరేకంగా ఒక ప్రాంతం ప్రజలే కాదు అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ సమైక్యమై పోరాడాలని సిపియం చెపుతోంది. ప్రజలు విడిపోతే బలపడేది పెట్టుబడిదారీ వర్గాలే. నిజంగా పెట్టుబడిదారులపై ద్వేషమే ఉంటే వారి దోపిడీకి గురయ్యే అన్ని ప్రాంతాల ప్రజల్ని ఐక్యం చేసి పోరాడాలి. అదే పని సిపియం చేస్తోంది.
ప్రత్యక రాష్ట్రం కోసం తెలంగాణాలోనూ, సమైక్యత కోసం సీమాంధ్రలోనూ ప్రజల మనోభావాలు బలంగా ఉన్నాయి. వీటిని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వారు ఎక్కడ తాళం అక్కడ వేస్తున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఒకే వైఖరి కలిగివున్నది సిపిఎం. అదే సమయంలో ప్రజల మనోభావాలతో ఏ ప్రాంతంలోనూ చెలగాటమాడటం లేదు. ఏ ఉద్యమంలోనూ భాగస్వామి కాలేదు. రెండు ప్రాంతాల్లోనూ ప్రజల రోజువారీ సమస్యలపై ఐక్యం చేయడానికి, కదిలించడానికి ప్రయత్నిస్తున్నది. పదవుల కోసం పాకులాడడం సిపియం నైజానికి విరుద్ధం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడమే సిపిఎం విధానం. పదవులు పోరాటసాధనమే తప్ప అలంకారం కాదు. ప్రధాని పదవినే తృణప్రాయంగా ఎంచి కాలదన్నిన చరిత్ర సిపియంది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ జీతభత్యాలను సైతం పార్టీకే సమర్పిస్తున్నారు. అవినీతికి పాల్పడేవారిని సిపిఎం సహించదు. నిస్వార్దంగా ప్రజలకు సేవ చేయడమే సిపిఎం కార్యకర్తలకు తెలిసిన విద్య. ఈ క్రమంలో పాలకుల దాష్టీకానికి, దౌర్జన్యాలకు కార్యకర్తలు గురవుతున్నారు. ప్రజల కోసం లాఠీ దెబ్బలు తినడం, కేసులు ఎదుర్కోవడం, జైళ్లకు పోవడానికి సిపిఎం కార్యకర్తలు అలవాటుపడ్డారు. ప్రజల కోసం త్యాగం చేయడంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు ముందుంటారన్న విషయం అందరూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా వాదులు సైతం సిపియం నిబద్దతను గౌరవిస్తున్నారు. ఇలాంటి పార్టీ ప్రజాప్రతినిధులపై, కార్యాలయాలపై కొంతమంది దాడులకి దిగటం అమానుషమే కాదు అన్యాయం కూడా.
కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర త్యాగాలతో పునీతమైనది. వీర తెలంగాణ విప్లవ పోరాటం మొదలు పున్నప్రవాయలార్‌, తెభాగ, వర్లి వంటి అనేక పోరాటాల్లో ఎర్రజెండా రాటుతేలింది. దేశ సమైక్యత కోసం పంజాబ్‌, అస్సాం లాంటి చోట్ల ప్రాణాలు సైతం అర్పించింది. నేడు జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదుల దాడులను ఎదిరించి నిలబడ్డ పార్టీ సిపిఎం. నిన్నటివరకు అధికారంలో వున్న బెంగాల్‌, కేరళ నేడు పాలిస్తున్న త్రిపురలలో సైతం ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని ఎదిరించి దేశ సమైక్యతను, లౌకికతత్వాన్ని కాపాడుతున్నది వామపక్షాలే. తెలంగాణాపై సిపియం వైఖరి సిద్దాంతపరమైందే తప్ప ప్రాంతీయపరమైంది కాదు. ఇది జాతీయ విధానంలో భాగం. సిపిఎం సూత్రబద్ధ వైఖరిని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ దుష్టతలంపుతో ప్రజలను తప్పుదారి పట్టించే వారి వలలో పడితే బలహీనపడేది ప్రజలకోసం పోరాడే పార్టీలే. తాత్కాలికావేశంలో అలాంటి పార్టీలను బలహీనపరచుకుంటే రేపు మన హక్కుల కోసం పోరాడేవారే కరువవుతారు.
-అరుణతార