Tuesday, July 26, 2011

మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ సిపిఎం నుంచి బహిష్కరణ

ఇబ్రహీంపట్నం మాజీ శాసన సభ్యులు మస్కు నర్సింహను పార్టీ నుండి బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు డివిజన్‌ కమిటీ తెలిపింది. ఆయనను రెండు సంవత్సరాల క్రితమే అన్ని బాధ్యతల నుండి తొలగించినట్లు డివిజన్‌ కమిటీ పేర్కొంది. పార్టీ సభ్యునిగా ఉంటూ సంఘాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాడని కమిటీ పేర్కొంది. పార్టీని అప్రతిష్ట పాలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతారంపేట గ్రామంలో ప్రజలు పోరాడి సాధించుకున్న భూమిని అక్రమంగా తమ బంధువుల పేర రాయించుకున్నాడని డివిజన్‌ కమిటీ పేర్కొంది. కమిటీ పలుమార్లు హెచ్చరించినా తన విధానం మార్చుకోలేదని మండిపడింది. ఎమ్మెల్యే కాకముందు తన ఆస్తులను, ఎమ్మెల్యే అయిన తర్వాత తన ఆస్తులపై సిపిఎం ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారని పేర్కొంది. ఆయనను సరిదిద్దేందుకు పార్టీ ప్రయత్నించినా తన పద్ధతి మార్చుకోలేదంది. పార్టీ ప్రతిష్టను దిగజార్చినందుకే ఆయన్ను బహిష్కరిస్తున్నట్లు కమిటీ తీర్మానించింది.

No comments:

Post a Comment